Breaking: మద్యంలో మత్తులో ఇద్దరు యువకులు ఘర్షణ.. బీటెక్ విద్యార్థి మృతి

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కొత్తగూడెం వన్‎టౌన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి గుణదీప్ (21) హత్యకి గురయ్యాడు. గుణదీప్‎తో పాటు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తికి మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో గుణదీప్​పై దాడి చేశాడు. దాంతో మృతుడు సృహ కోల్పోయాడు. అతడిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. వన్టౌన్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.