BREAKING : తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు సోనియాగాంధీ దూరం

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ స్పష్టం చేసింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరొస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.