Ts Politics: కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు.. సీఎంకి బండి సంజయ్ లేఖ

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్‎పై సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.