Breaking: వికారాబాద్ జిల్లాలో జాతీయ పక్షిని కాల్చుకు తిన్న యువకులు

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: సరదాగా వేటకు వెళ్లిన యువకులు ఊరికే ఉండక చిక్కుల్లో పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌడపూర్ మండల పరిధిలో అడవిలో వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు ఊరికే ఉండక జాతీయ పక్షి నెమలిని వేటాడారు. అంతటితో ఆగకుండా ఏకంగా నెమలి మాంసాన్ని నిప్పుల మీద కాల్చి ఎంచక్కా విందు భోజనం చేశారు. విషయం ఈ నోట.. ఆ నోట పాకి చివరికి అటవీ శాఖ అధికారుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన వారు యువకులపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.