Breaking: మోదీ 3.0 క్యాబినెట్ మంత్రుల లిస్ట్ ఇదే

0
24

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఈ రోజు సాయంత్రం ఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులు మరియు ఎంపీలకు మోదీ తేనీటి విందు ఏర్పాటు చేశారు. అలాగే రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో సహా మోడీ 3.0 క్యాబినెట్‌లో కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారికి ఇప్పటికే కాల్స్ వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ మాజీ సీఎంలు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది. లక్నో లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ కేంద్ర రక్షణ మంత్రిగా కొనసాగునుండగా కీలకమైన పలు శాఖలను బీజేపీ ఆంటీ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అలానే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు చోటు దక్కినట్లు సమాచారం వస్తుంది. కాగా ఇప్పటి వరకు పలువురు ఎంపీలు మంత్రి పదవులకు ఖరారు అయ్యాయని ఓ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.