YS Sharmila: ఇది కేవలం పిరికిపందల చర్య.. వైఎస్ షర్మిల సీరియస్

0
21

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణమని.. ఇది కేవలం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. తెలుగు ప్రజల గుండెల్లో చెదిరిపోని గుడి కట్టుకున్న మహానేత వైఎస్ఆర్ అని.. వైఎస్ఆర్ పేరు చెరపలేని జ్ఞాపకం అన్నారు. అలాంటి నేతకు నీచ రాజకీయాలు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు అన్నారు. వైఎస్ఆర్‌ను అవమానించే చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరారు. కాగా, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.