Kishan reddy: సాధారణ కార్యకర్తలకు కేంద్రమంత్రి పదవులు రావడం కేవలం బీజేపీలోనే సాధ్యం

0
19

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: సాధారణ కార్యకర్తలకు కూడా కేంద్రమంత్రి పదవులు రావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ కార్యకర్తలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం… అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులు అయిన తాను, బండి సంజయ్, శ్రీనివాస వర్మ మొదటి నుంచి పార్టీ కోసం పని చేశామని… సిద్ధాంతమే ఊపిరిగా బతికామన్నారు. సాధారణ కార్యకర్తలకు కేంద్రమంత్రి పదవులు రావడం గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.