Hyd: ప్రశాంతంగా ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఆస్తమా వ్యాధిగ్రస్థులకు మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఆదివారం ఉదయంతో ముగిసింది. దాదాపు ఒకరోజు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, బిహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 55,440 మంది చేప ప్రసాదాన్ని స్వీకరించారని అధికారులు వెల్లడించారు. చేప ప్రసాదం అందని వారు నిరుత్సాహానికి గురికావొద్దని, బత్తిని సోదరులు హైదరాబాద్‌లోని దౌద్‌బౌలిలో ఉన్న వారి స్వగృహంలో కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తారని తెలిపారు.