Breaking: టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నారా చంద్రబాబు

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ వేదికగా మంగళవారం కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబేనని ముక్తకంఠంతో బలపరిచారు. అదేవిధంగా కూటమి తరఫున సీఎంగా చంద్రబాబు పేరును జనసన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు సంయుక్తంగా గవర్నర్‌కు పంపనున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరనున్నారు.