Breaking: నేడు ఏపీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. చంద్రబాబుతో భేటీ

0
17

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇందుకోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈరోజు రాత్రి 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 10:20 గంటలకు అమిత్ షా చంద్రబాబుతో భేటీ కానున్నారు. భేటీ అనంతరం రాత్రి 11:20 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు. కాగా, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు ఉదయం 10:40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొనున్నారు. 10:55 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక వద్దకు చేరుకుంటారు. నిన్న కేంద్ర సహయ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.