Breaking: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజ్‌ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు. గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈఏపీసెట్‌ పరీక్షలను నిర్వహించింది. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీని విడుదల చేయగా.., ఇప్పుడు ఫైనల్ రిజల్ట్‎ను ప్రకటించడం జరిగింది. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చరల్‌ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఫలితాల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx