Breaking: తెలంగాణలో 20 మంది IAS అధికారులు బదిలీ.

0
25

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. మొత్తం 20 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ.. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తెలంగాణలో 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
1. ఖమ్మం కలెక్టర్‎గా మొజామిల్ ఖాన్
2. నాగర్ కర్నూలు కలెక్టర్‎గా సంతోష్
3. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‎గా సందీప్ కుమార్ ఝా
4. కరీంనగర్ కలెక్టర్‎గా అనురాగ్ జయంతి
5. కామారెడ్డి కలెక్టర్‎గా ఆశిష్ సాంగ్వాన్
6. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‎గా జితేష్ వి పాటిల్
7. జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్‎గా రాహుల్ శర్మ
8. నారాయణపేట కలెక్టర్‎గా సిక్తా పట్నాయక్
9. పెద్దపల్లి కలెక్టర్‎గా కోయ శ్రీహర్ష
10. హన్మకొండ కలెక్టర్‎గా ప్రావీణ్య
11. జగిత్యాల కలెక్టర్‎గా సత్యప్రసాద్
12. మహబూబ్ నగర్ కలెక్టర్‎గా విజియేంద్ర
13. మంచిర్యాల కలెక్టర్‎గా కుమార్ దీపక్
14. వికారాబాద్ కలెక్టర్‎గా ప్రతీక్ జైన్
15. నల్గొండ కలెక్టర్‎గా నారాయణ రెడ్డి
16. వనపర్తి కలెక్టర్‎గా అదర్శ్ సురభి
17. సూర్యాపేట కలెక్టర్‎గా తేజస్ నంద్ లాల్ పవార్
18. వరంగల్ కలెక్టర్‎గా సత్య శారదా దేవి
19. ములుగు కలెక్టర్‎గా దివాకర్
20. నిర్మల్ కలెక్టర్‎గా అభిలాష అభినవ్‌