Telangana: అత్తరింటికి దారేది..!

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: కన్నోళ్ల ఆశలపై నీళ్లుచల్లుతూ.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కన్నకూతురు ప్రేమించినోడిని మనువాడితే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. అయితే, కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రులు గట్టి షాకే ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో మమత అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. దీంతో వాళ్లిద్దరూ ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా, రత్నాకర్‌ ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే మమత ఇల్లు దాటి వెళ్లాల్సిందే. ఇప్పటికే ప్రేమించినోడితో పెళ్లి చేసుకుందని రగిలిపోతున్న మమత తల్లి రత్నాకర్ ఇంటి వెళ్లే దారిలో ఏకంగా గోడ కట్టేశారు. ఇది చూసిన గ్రామస్తులు రోడ్డుపై గోడ ఏంటని అవాక్కవుతుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి.