CM Revanth Reddy: నేడు ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన

0
13

ఉత్తర తెలంగాణకు రాజమార్గమైన హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ నేడు భూమి పూజ చేయనున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి సమీపంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

రూ.2232 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్ తో నగరంలో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 11.3 కిలోమీటర్ల పొడవు, ఆరు లైన్లతో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.

మార్చి9 న సికింద్రాబాద్ లో ఎన్‌హెచ్ -44 ఎలివేటేడ్ కారిడార్ కు సైతం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రెండు ఎలివేటేడ్ కారిడార్ల అంచనా వ్యయం రూ.9000 కోట్లు అని అధికారులు స్పష్టం చేశారు. కారిడార్‌కు సంబంధించి డీపీఆర్‌ల రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది.

కాగా జనవరి 5న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి డిఫెన్స్‌ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతివ్వాలని లేఖను అందజేశారు