Telangana: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావులతో కలిసి పరిశీలించారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో రైస్ మిల్‌లో ఘటన స్థలాన్ని పరిశీలించి రామగుండం సీపీ శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ ఠాకూర్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.