Breaking: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: మెదక్‎లో జంతు వధకు సంబంధించి అల్లర్లు జరగడం తెలిసిందే. దుకాణాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురికాగా, నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో, మెదక్ వెళ్లేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‎ను పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తాను మెదక్ వెళతానని రాజా సింగ్ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ముంబయి నుంచి వస్తున్నారని తెలుసుకుని.. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అటు, మెదక్ లో బీజేపీ శ్రేణులు బంద్‎కు పిలుపునిచ్చాయి. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.