YS Sharmila: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వైఎస్ షర్మిల భేటీ.. ఏపీపై ఫోకస్

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్, ప్రియాంకను ఆమె కలిశారు. ఈ భేటీలో ఏపీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగినట్లు షర్మిల టిట్టర్ ద్వారా తెలిపారు. భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులతో పాటు పలు అంశాలపైనా చర్చించనట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరిస్తుందని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.