KCR: హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని.. రిట్ పిటిషన్‌ను మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ చెప్పారు. పిటిషన్‌లో ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డిలను చేర్చారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్‎కు 12 పేజీల లేఖ రాసి పలు అంశాలను ప్రస్తావించారు.