Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు హీరోయిన శ్రీలీల

0
31

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ శ్రీలీల మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని.. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు స్వామి వారిని దర్శించుకోవడం అలవాటని తెలిపారు శ్రీలీల.