PM MODI: ప్రధాని మోదీకి కార్డు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించిన హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.

0
25

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తొందరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల సీక్రెట్‌గా ప్రియుడు నికోలయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చింది. ఈ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయడంతో.. వరలక్ష్మికి కాబోయే భర్తకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. అతనికి ఇంతకు ముందే పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. అయినప్పటికీ వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతుంది. కానీ వివాహం ఎక్కడ, తేదీ వివరాలు బయటపెట్టలేదు. గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరికీ తన వెడ్డింగ్ కార్డ్ ఇస్తూ సందడి చేస్తోంది వరలక్ష్మి. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తన పెళ్లికి రావాలని ఆహ్వానించింది.

కాగా, తాజాగా వరలక్ష్మి , శరత్ కుమార్, రాధిక, నికోలయ్ సచ్‌దేవ్, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ వరలక్ష్మి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఢిల్లీలో ఒక రోజు. మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీజీని కలవడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆయన చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ మాతో చాలా సమయం గడిపారు. మా పెళ్లికి ఆయన్ను ఆహ్వానించిన ఘనత మాకు దక్కింది. చాలా ఆప్యాయంగా, స్వాగతించినందుకు ధన్యవాదాలు సార్. ఇదంతా నీ వల్లే జరిగినందుకు ధన్యవాదాలు డాడీ. అలాగే మేము మా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మ్యామ్‌ని కూడా కలుసుకుని ఆహ్వానించాము. మీతో చాలా విషయాల గురించి చాట్ చేసినందుకు చాలా అద్భుతంగా ఉంది.. ముఖ్యంగా కళ.. మమ్మల్ని చూసినందుకు ధన్యవాదాలు అమ్మ.. మీరు ఎంత బిజీగా ఉన్నారో మాకు తెలుసు. మా సమాచార, ప్రసార భారత మంత్రి మురుగన్‌కు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్.. రిసెప్షన్‌లో మిమ్మల్ని చూడాలని ఎదురుచూస్తున్నాను.. మొత్తానికి ఢిల్లీలో అద్భుతమైన రోజు.. నాన్నకు ధన్యవాదాలు’ అని వరలక్ష్మి శరత్ కుమార్ రాసుకొచ్చింది. అలాగే ఢిల్లీలో అందరితో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది.