TS News: డీఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ శనివారం వేకువ జామున మృతి చెందగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో డీఎస్ అజాత శత్రువు అన్నారు. డీ. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డీఎస్ చనిపోవడం బాధాకరమన్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు ఉన్నారు.