PawanKalyan: కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

0
19

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి చేరుకున్న ఆయనకు మొదట ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేసుకున్న పవన్.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆయన ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు, అభిమానులకు అభివాదం చేస్తూ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు.