TS Politics: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. రైతులను దిగజార్చిన కాంగీయులు అంటు ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్

0
29

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు భోజడ్ల ప్రభాకర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంత మంది తన పొలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించాడు. ఎమ్మార్వో, ఎస్ఐ, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని ఆరోపించాడు. అయితే ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ‘చివరికి పేద రైతులను విషం తాగే స్థాయికి దిగజార్చారు కాంగీయులు. ఇలాంటి దౌర్జన్యాలు ప్రతి చోటా జరుగుతున్నాయి. చింతకానిలో ఇది బయట పడ్డది. అన్ని ఆధారాలతో ఏ అధికారి దగ్గరికి పోయి ఫిర్యాదు చేసినా ఒకటే సమాధానం “చూస్తం..చేస్తం..నువ్వు ఇంటికి పో..” కనీసం ఫిర్యాదుకు తీసుకున్నట్టుగా రసీదు ఇస్తలేరు.. రైతన్న లారా, దయచేసి మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి. మీకు అన్యాయం జరిగితే వెంటనే స్థానిక బీఆర్‌ఎస్ నేతలను సంప్రదించండి. వారు మీకోసం పోరాడతారు. రైతన్నల ప్రయోజనాలను గుండెలో పెట్టుకొని కాపాడిన చరిత్ర కేసీఆర్ గారిది.’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఛీటింగ్ ఫార్మర్మ్ అని ఈ ట్వీట్‌కు హ్యాష్ ట్యాగ్ జత చేశారు.