Breaking: యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల హత్యాచార యత్నం

0
33

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్ : JSR సన్‎సిటీ రియల్‌ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు హత్యాచారానికి యత్నించిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్‌లో నివాసం ఉంటూ మియాపూర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్‌లో ట్రైనీగా జాయిన్ అయింది. అయితే అదే రియల్‌ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ విజిట్ కోసం అంటూ ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి ఆమెపై హత్యాచారానికి యత్నించారు. అయితే వారి నుండి తప్పించుకున్న ఆ యువతి అదేరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించగా.., ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్‎ఐఆర్ కింద కేసు నమోదు చేసి.., అక్కడి నుంచి మియాపూర్‌కు కేసు బదిలీ చేశారు. హత్యాచార ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.