Breaking: బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండోరోజే సంచలనం.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

0
23

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: దేశ వ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చిన రెండో రోజే కరీంనగర్ జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. ఈ మేరకు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు ఆయనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం కరీంనగర్‎లో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ ప్రభుత్వ అధికారులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు