Cricket: దేవుడికి కూడా తనకంటూ సొంత ప్లాన్ ఉంటుంది- రిషబ్ పంత్

0
31

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: టీ-20 ప్రపంచ కప్-2024 ఫైనల్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై 7పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా క్రికెటర్లు తమ జీవితంలో గడచిన గడ్డుపరిస్థితులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా రిషబ్ పంత్ విన్నింగ్ మెడల్‌తో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఎమోషనల్ పోస్టు పెట్టాడు.‘ఈ క్షణం ఎంతో గొప్పగా, గర్వంగా, అనందంగా ఉంది. ఆ దేవుడికి కూడా తనకంటూ సొంత ప్లాన్ ఉంటుంది. ఈ మెడల్ నాకు ఎంతో విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, ఘోరమైన ప్రమాదాన్ని దాటి వచ్చిన పంత్..ఈ టోర్నీలో 8 మ్యాచుల్లో 171 పరుగులు చేయడంతో పాటు అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రిషబ్ పంత్.