AP Politics: అధికార పార్టీకి షాక్.. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌పై కేసు నమోదు

0
31

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికి మాజీ ఎమ్మెల్యేతో గొడవ కారణంగా ప్రతిపక్షాలు ఆయన తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై కేసు నమోదైంది. తన ఇంటిని అక్రమంగా కూల్చివేశారని ఎ. కొండూరు మండలం కంభంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఎంపీపీ అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్నారనే నెపంతో ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి ఎంపీపీకి చెందిన భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. కాగా ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ప్రతిపక్ష నాయకుల కట్టడాలు కూల్చడం ఎంటని రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.