Ambani Marriage: అనంత్ అంబానీ-రాధికాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆశీర్వాదం.

0
30

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: అంగరంగ వైభవంగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా శుక్రవారం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్(Anant Ambani-Radhika) దంపతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) దీవించారు. శనివారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌(Jio World Centre)లో జరిగిన ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు ఆయన హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంత్ అంబానీ తండ్రి, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముకేశ్ అంబానీ(Mukesh Ambani), నీతా అంబానీ(Nita Ambani)తో పాటు కుటుంబ సభ్యులు అందరినీ ప్రధాని మోదీ పలకరించారు. తన కొడుకుని ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ముకేశ్ అంబానీ సాదరస్వాగతం పలికారు.

అలానే జియో వరల్డ్ సెంటర్‌లో ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), అజిత్ పవార్‌(Ajit Pawar) కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక జరిగింది. ఇవాళ (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి.