CM Chandrababu Naidu Gudiwada Tour: సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన షెడ్యూల్ ఖరారు

0
51

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడ్డ అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పున:ప్రారంభిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభానికై సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లను ఆయన గుడివాడలో ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 6.30 గంటలకు ప్రాంభిస్తారని సమాచారం. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. వీటికి ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదటి సారి సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.