Ys Sharmila Comments On CM Jagan: జగన్ వెన్నుపొడిచిండు.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిల

0
13

ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరిలాంటిదని.. పోరాడకపోతే ఎప్పటికీ రాదని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఒకే ఒక్క వ్యక్తి రాహుల్ గాంధీ.. అందుకే ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టా. అంతేగానీ వ్యక్తిగత కారణాలతో రాలేదు’ అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. పదవుల కోసం రాజకీయాలు చేసేదాన్ని అయితే 2019లోనే పదవులు పొంది ఉండేదాన్నని అన్నారు.

ఏపీకి హోదా విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు షర్మిల . సీఎం అయ్యాక జగన్ హోదా విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారని దుయ్య బట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టే విడిపోయి పదేళ్లయినా వెనుకబడి ఉందని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదన్నారు షర్మిల. రాష్ట్రానికి హోదా సాధించలేని వాడు రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతాడంటా జగన్ పై మండి పడ్డారు షర్మిల. షర్మిల కంటతడి పెట్టిన సమయంలో బీజేపీ, వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.