శివరాత్రి రోజున శివాలేత్తించారు.. రోహిత్, గిల్‌ సెంచరీలు

0
14

శివరాత్రి రోజున సెంచరీలతో టీమిండియా ఆటగాళ్లు శివాలేత్తించారు. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ (101 ), శుభ్‌మన్‌ గిల్‌(100) సెంచరీలు కంప్లీట్ చేశారు. రోహిత్ కు టెస్టుల్లో 12వ సెంచరీ కాగా గిల్ కు నాలుగో సెంచరీ కావడం విశేషం. రోహిత్‌ సెంచరీలో 13 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. బౌండరీల ద్వారానే 70 పరుగులు రాబట్టాడు రోహిత్.

ఇక శుభ్‌మన్‌ గిల్‌ 10 ఫోర్లు, 5 సిక్సర్ల సహయంతో 137 బంతుల్లో 100 పరుగుల మార్క్‌ చేరుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి ఇప్పటికే 153 పరుగులు జోడించారు. ఇక యశస్వని జైస్వాల్ 57 పరగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి టీమిండియా స్కోర్ 262 పరుగులతో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 218 పరుగులకు ఆలౌటైంది.