అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం : భట్టి విక్రమార్క

0
12

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఏ కుటుంబం ఉండరాదు అనేది ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మొదటి దశలో ఇద్దరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రతి లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రజలు చూసి చూసి అలసిపోయారని తెలిపారు. ఇది చాలా బాధాకరం అన్నారు. రాష్ట్రంలోని అర్హులందరినీ గుర్తించి లబ్ది చేకూరుస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ద్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్లో లక్షలాది మంది మహిళలతో భారీ సభ నిర్వహించి వడ్డీ లేని రుణాలకు తిరిగి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. డ్వాక్రా మహిళలు చిన్న చిన్న వ్యాపారాలకి పరిమితం కాకుండా వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర విభజన నాటికి మనది ధనిక రాష్ట్రం… కానీ గత పాలకులు ఇందిరా క్రాంతి పథకాన్ని అటకెక్కించారని ఎద్దేవా చేశారు.