YS Jagan Tour Pulivendula Today: నేడు పులివెందులలో సీఎం జగన్ పర్యటన

0
9

సీఎం జగన్ ఇవాళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రూ.862 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్, మెమోరియల్ పార్క్, ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్-1, వైఎస్సార్ జంక్షన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పులివెందులలో భద్రత కట్టుదిట్టం చేవారు. దాదాపు రూ.860కోట్ల రుపాయల విలువైన అభివృద్ధి పనుల్ని ఇప్పటికే ప్రారంభోత్సవం కోసం సిద్ధం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలిచి తీరాలని భావిస్తున్న వైఎస్సార్సీపీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని భావిస్తోంది.

కాగా ఆదివారం జగన్‌ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో ప్రసంగించారు. మరో ఐదేళ్లు తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని కామెంట్స్ చేశారు.