One Men Dies While Attending siddham Meeting: సిద్ధం సభలో వ్యక్తి మృతి.. రూ.10 లక్షల ఆర్ధిక సహాయం

0
11

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ(35) మృతిచెందాడు. అతని మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక గ్యాలరీ నుంచి మరో గ్యాలరీకి వెళ్తున్న క్రమంలో అతను అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

హాస్పటల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హడావుడిగా హాస్పటల్​కి చేరుకున్నారు. అక్కడకి వచ్చాక ముకళి మృతి చెందారని చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. బస్సు నుంచి జారిపడి పల్నాడుకు చెందిన బాలదుర్గారావు మరణించాడు.

బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి పోవడంతో దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలిలో మృతుని బంధువులు బోరున విలపించారు. విషయం తెలిసిన నాన్‌హైవే సిబ్బంది ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు