Revanth Reddy : పాలమూరు నుంచి రేవంత్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

0
53

రానున్న లోక్ సభ ఎన్నికల కోసం మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మార్చి 6న స్థానిక ఎంవీఎస్ కాలేజీలో జరిగే పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం పాల్గొననున్నారు. ఇప్పటికే కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ప్రకటించిన రేవంత్.. ఈ సభ ద్వారా పాలమూరు జిల్లాకు మరిన్ని వరాలు ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

అదేరోజు ప్రముఖ పారిశ్రామిక వేత్త మన్నె జీవన్‌రెడ్డి, ఆయన అనుచరు లు పెద్దఎత్తున సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం పర్యటన నేపధ్యంలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. సభ నిర్వహించే స్థలం ఫైనల్‌ అయితే బందోబస్తు పరంగా చర్యలు తీసుకోకున్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణకు నాయకులు కసరత్తు చేస్తున్నారు.