Buchaiah Chowdary: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న గోరంట్ల

0
18

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన పంతం నెగ్గించుకున్నారు. టీడీపీ జనసేన కూటమిలో భాగంగా రాజమహేంద్ర వరం నియోజకవర్గం సీటుపై ఉత్కంట నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇద్దరు పోటీపడ్డారు. అయితే కూటమిలో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తారని చర్చ జరిగింది. కానీ కాసేపటి క్రితమే నిడవదోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది.

అయితే ఎట్టిపరిస్థితుల్లో సిట్టింగ్ సీటు వదులుకోనని చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒత్తిడి తెచ్చారంట. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ కందుల దుర్గేష్‌ను పిలిచి మాట్లాడారు. నిడదవోలులో పోటీ చేయాలని కందుల దుర్గేష్ కు సూచించారు..దీంతో కందుల దుర్గేష్ కూడా నిడదవోలు నుంచి పోటీ చేస్తానని చెప్పారు.. జనసేన పార్టీ నేతలతో సమావేశమై తన నిర్ణయాన్ని చెప్పారు.

అంతేకాదు ఇటీవలే బుచ్చయ్య చౌదరి కూడా దుర్గేష్‌ను కలిసి మాట్లాడారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రెండు పార్టీల నేతలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.