BCCI Good News: బీసీసీఐ గుడ్‌న్యూస్ .. రిషభ్ పంత్ ఈజ్ బ్యాక్

0
16

ఢిల్లీ క్యాపిటల్స్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఫిట్‌నెస్ సాధించినట్లు ప్రకటించింది. ఇప్పటికే పంత్‌ నెట్స్‌లో పూర్తి స్థాయి ప్రాక్టీస్ ప్రారంభించాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్, ఫీల్డింగ్ సాధన మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు. రిషభ్ పంత్ కోలుకోవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంత్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈనెల 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో భాగంగా పంత్ సారథ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ రోజున పంజాబ్ కింగ్స్‌తో ఢీకొట్టనుంది. మరోవైపు గాయాల కారణంగా బౌలర్లు షమీ (GT), ప్రసిద్ధ్ కృష్ణ (RR) ఈ సీజన్‌కు దూరమయ్యారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు గతేడాది ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఆ సీజన్‌లో ఢిల్లీ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది. టోర్నీ మొత్తంలో 14 మ్యాచులు ఆడి.. కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో ప్లేసులో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.