సీఎం హోదాలో తొలిసారి సీఈసీ మీటింగ్ కు రేవంత్

0
13

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్‌‌‌‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సీఈసీ మీటింగ్‌‌‌‌కు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, సీఈసీ మెంబర్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు . త్వరలో మరో 3 లేదా 4 పేర్లతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించనుంది. కాంగ్రెస్ నిన్న 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..

ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఈసీ మీటింగ్ మూడోసారి సమావేశం అవుతోంది. ఈ నెల 7న తొలి మీటింగ్ జరగగా,8న దేశ వ్యాప్తంగా 39 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితాను రిలీజ్‌‌‌‌ చేసింది. సోమవారం రెండోసారి మీటింగ్ జరగగా, అభ్యర్థులను ప్రకటించలేదు. నిన్న రెండో జాబితా రిలీజ్ చేసినప్పటికీ తెలంగాణ అభ్యర్థుల పేర్లు లేవు. తెలంగాణ నుంచి జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, చేవెళ్ల, మహబూబాబాద్, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ పర్యటన కాంగ్రెస్ ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది.