Breaking: రాష్ట్రపతి భవన్‎లో స్వేచ్చగా తిరుగుతున్న చిరుత లాంటి జంతువు

0
16

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. అయితే VIPలు ఉన్న ఆ ప్రదేశంలో చిరుత లాంటి ఓ జంతువు స్వేచ్చగా తిరుగుతుండటం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎంపీ దుర్గా దాస్ ప్రమాణం చేస్తుండగా వెనుక భాగంలో చిరుత లాంటి ఓ జంతువు తిరుగుతూ కనిపించింది. అంత మంది మాట్లాడుతుండాగ ఆ జంతువు కొంచెం కూడా భయం లేకుండా ఆ ప్రదేశంలో తిరగడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది పెంపుడు జంతువా? పిల్లా? లేక చిరుత ప్రవేశించిందా? అనే దానిపై చర్చ జరుగుతోంది.