TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ

0
32

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: బెంగుళూరులో రేవ్ పార్టీలో ఆర్టిస్ట్ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడం., తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అనంతరం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవ్ పార్టీ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హేమ శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు నటి హేమ. అయితే ఆ వివాదం తర్వాత హేమ మీడియా ముందుకు రాలేదు.

కాగా, నేడు హేమ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం బాగా జరిగిందని.. తాను ఇక్కడే పుట్టానని.. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తన పుట్టిల్లులా ఉంటుంది అని తెలిపారు. ఈ క్రమంలో మీడియా రేవ్ పార్టీ ఇష్యూ గురించి ప్రశ్నించడంతో హేమ సమాధానమిస్తూ.. ‘ ఏమో మీకే తెలియాలి, మీరే వార్తలు రాస్తున్నారు కదా ’ అని చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తిరుమల నుంచి బయటకు వెళుతుంటే పలువురు వ్యక్తులు హేమతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.