AP Assembly: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

0
9

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా సీఎం చంద్రబాబు కసరత్తులు చేశారు. సమావేశాల షురూ కోసం తేదీని ఫిక్స్ చేశారు. దీంతో ఈ నెల 17 నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలి సమావేశాలు కానుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలపనున్నారు.