NCBN: ఈనెల 4న ఢిల్లీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

0
11

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీకానున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విభజన హామీల పైనా కేంద్ర పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్టు సమాచారం. మోదీ ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ఆయన టూర్‎పై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఏపీ ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి ప్రకటన వెలువడనుందని, ఎన్ని నిధులు వస్తాయన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.