Breaking: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో ఈసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురం JNTU కాళాశాల అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో చైర్మన్ శ్రీనివాసరావు గురువారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. అయితే, ఈ నెల 8న ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించగా మొత్తం 36,369 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, ఫలితాల్లో అనూహ్యంగా హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx వెబ్ సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చని సూచించారు. ఈ ఫలితాల్లో అభ్యర్థుల ర్యాంకుతో పాటు సాధించిన మార్కులను కూడా అందిస్తామని ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.