Ap Politics: రేపు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం

0
10

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరడంతో ఇక రాష్ట్రంలోని కూటమి పార్టీల అధినేతలు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ హాళ్లో ఉ.9:30 గంటలకు ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. మందుగా శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. అదేవిధంగా జూన్ 12న బుధవారం గన్నవరం వేదికగా ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల భేటీలో మంత్రివర్గ ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఓ జాతీయ మీడియాకు చెప్పినట్లుగా న్యూస్ వ్యాపించడం మూడు పార్టీల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.