AP Politics : నేటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారం

0
15

జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. నేటి నుంచి ఏప్రి ల్‌ 12 వరకూ ఆయన పర్యటనలు ఉంటాయి. తొలి విడతలో భాగంగా నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ‘వారాహి విజయభేరి యాత్ర’ పేరిట ప్రచారం చేయనున్నారు.

ఈ నియాజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను జనసైనికులు, వీరమహిళలు విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్‌ కోరారు. ఈ సమావేశ్లలో పవన్‌ బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈరోజు సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్‌లో ప్రారంభం కానుంది.

ఇక తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. పొలిటికల్‌ హీట్‌ పెరిగినట్టు అయ్యింది.. ఈ పర్యటనలో పార్టీ క్యాడర్ తో సమావేశాలు, నియోజకవర్గానికి చెందిన పలు వర్గాలతో మీటింగ్‌లు ప్లాన్‌ చేసింది జనసేన.. ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్‌ కల్యాణ్‌.