AP Politics: నేడు జనసేన అభ్యర్థుల ప్రకటన?

0
10

నేడు జనసేన అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు, బందరు ఎంపీ సీటుకు అభ్యర్థుల్ని జనసేన అనౌన్స్ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై 4 రోజుల నుంచి పవన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా సీట్ల ఆశావహులు ఆయనతో పార్టీ కార్యాయలంలో భేటీ అయ్యారు. నేడు మరోసారి పార్టీ కార్యవర్గంతో చర్చించిన అనంతరం జనసేనాని జాబితా అనౌన్స్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురానికి 3రోజుల పర్యటనకు రానున్నారు. ఆయన అక్కడి నుంచే బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. పట్టణానికి చేరుకోగానే తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి, పాదగయ క్షేత్రంలో పూజలు చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం ప్రచారం మొదలుపెడతారని పేర్కొన్నాయి. అక్కడి పర్యటన నుంచి పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వెల్లడించాయి.