AP Politics: 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను ఇస్తే.. దేశం ఏపీ వైపు చూసేలా చేస్తా: పవన్

0
14

21 ఎమ్మెల్యే సీట్లు, రెండు లోక్ సభ సీట్లు జనసేన గెలిస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. జనసేన లేకపోతే ఏపీలో పొత్తులు లేవన్నారు. పొత్తుల కోసం బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించానని చెప్పారు.

కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు పవన్ . తన కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన ఉదయ్ ను ఎంపీగా పోటీచేస్తారని తెలిపారు. ఒక వేళ మోదీ, అమిత్ షా సూచిస్తే తాను కాకినాడ ఎంపీగా పోటీచేస్తానన్నారు పవన్..అపుడు ఉదయ్ తాను స్థానాలు మార్చుకుంటామని చెప్పారు. పిఠాపురం అసెంబ్లీ,కాకినాడ ఎంపీ రెండు స్థానాలు తమకు కీలకమన్నారు పవన్.

ఎక్కడి నుంచి పోటీ చేస్తారని బీజేపీ అధిష్టానం తనను అడిగితే ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పానన్నారు. కాకినాడ ఎంపీ సీటు గెలవడం ముఖ్యం కాదని..లక్ష మెజారిటీ రావాలి కాకినాడ దద్దరిల్లాలని అన్నారు..

ఈ ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీ 144 ఎమ్మెల్యే సీట్లు,17 ఎంపీ సీట్లు, జనసేన21 అసెంబ్లీ, 2 లోక్ సభ, బీజేపీ 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.