AP Politics: ఇవాళ టీడీపీలోకి ఎంపీ మాగుంట

0
15

ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైకిలెక్కనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాగుంట కుమారుడు రాఘవరెడ్డికి టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీ టికెట్ ఖరారైనట్లు సమాచారం

. మరోసారి మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. ఓటమి తప్పదంటూ క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందిన నేపథ్యంలో మాగుంట టికెట్ ఇవ్వలేదాయన. టికెట్ దక్కదనే విషయం ఖరారు కావడంతో వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన తనయుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరనున్నారు.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు మాగుంట. ఈ మేరకు ప్రకాశం జిల్లా ప్రజలకు ఓ బహిరంగ లేఖను రాశారు. తనను, తన కుటుంబాన్ని ఎప్పట్లాగే ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.