AP POLITICS :వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ వల్ల అసంతృప్తి చెందిన వైసీపీ నేత ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చీరాల గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోవర్దన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.