BCCI : దేశవాళీ క్రికెట్‌పై బీసీసీఐ మరో కీలక నిర్ణయం

0
21

దేశవాళీ క్రికెట్‌పై బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అబ్బాయలకు లాగే మహిళలకూ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలు నిర్వహించాలని డిసైడ్ అయింది. పుణె వేదికగా మార్చి 28 నుంచి ఏప్రిల్ 11 వరకు సీనియర్‌ మహిళల ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఒక్కో మ్యాచ్‌ మూడు రోజులపాటు జరగనుంది.

నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్-ఈస్ట్ జోన్‌ల ఆధారంగా విభజించబడిన ఆరు జట్లు ఈ టోర్నమెంట్ లో పోటీ పడతాయి. టోర్నమెంట్ మార్చి 29 నుండి ప్రారంభం కానుంది. మార్చి 29, 30, 31 తేదీల్లో క్వార్టర్స్‌ పోటీ జరగనుంది. క్వార్టర్స్‌లో విజేతలుగా నిలిచిన జట్లు.. సెమీఫైనల్‌కు చేరుకుంటారు. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఏప్రిల్ 5 నుండి 7 వరకు జరిగే అవకాశం ఉంది.ఫైనల్ ఏప్రిల్ 9, 10 ,11 తేదీల్లో జరుగుతుంది. ఈ టోర్నీకి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

కాగా చివరిసారిగా 2018లో రెండు రోజుల మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించింది. ఈ ఏడాది ఆరంభంలో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు రెండు టెస్టు సిరీస్‌లు ఆడింది. స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో రికార్డు విజ‌యంతో హ‌ర్మన్ ‌ప్రీత్ సేన చ‌రిత్ర సృష్టించింది